సీఎం కెసీఆర్ కు అస్వస్థత..యశోదాలో పరీక్షలు
BY Admin11 March 2022 6:20 AM GMT
X
Admin11 March 2022 7:11 AM GMT
ముఖ్యమంత్రి కెసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన హుటాహుటిన సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అక్కడ ఆయనకు పరీక్షలు జరుగుతున్నాయి. సీఎంకు యాంజియోగ్రామ్ తోపాటు సీటీస్కాన్ పరీక్షలు చేస్తున్నారు. వాస్తవానికి ఆయన శుక్రవారం నాడు యాదాద్రి పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అనారోగ్యంగా ఉండటంతో ఆయన ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఎడమ చేయి లాగుతున్నట్లు కెసీఆర్ తెలిపినట్లు ఆయన వ్యక్తిగత డాక్టర్ ఎం వీ రావు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. గత రెండు రోజులుగా కెసీఆర్ వీక్ గా ఉన్నట్లు తెలిపారు.
Next Story