Telugu Gateway
Telangana

తెలంగాణకు తీరనున్న రెమిడెసివర్ కొరత

తెలంగాణకు తీరనున్న రెమిడెసివర్ కొరత
X

కరోనా బాధితుల చికిత్స కోసం వాడే ముందుల్లో రెమిడెసివర్ కీలకంగా మారిన విషయం తెలిసిందే. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ మందుల కొరత తీవ్రంగా ఉంది. కరోనా నియంత్రణ లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్, రెమిడెసివర్ ఇంజక్షన్లు, వ్యాక్సీన్ల సరఫరాను పెంచేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఫోన్ చేసి చెప్పారు. తెలంగాణకు ప్రస్తుతం ఇస్తున్న 5,500 రెమిడిసివర్ల ఇంజక్షన్ల సంఖ్యను, సోమవారం నుంచి 10,500 కి పెంచుతున్నట్టుగా కేంద్ర మంత్రి సిఎం కు తెలిపారు. ఆక్సిజన్ సరఫరాను పెంచాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండు చేస్తున్న నేపథ్యంలో.. అధనంగా 200 టన్నుల ఆక్సీజన్ ను తెలంగాణకు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని భిలాయ్ నుంచి, ఒరిస్సా లోని అంగుల్ నుంచి, పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ నుంచి తెలంగాణకు ఆక్సీజన్ ను సరఫరా చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్రమంత్రి తెలిపారు. సరఫరాకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా కేంద్రమంత్రి సిఎం కెసిఆర్ ను కోరారు.

వ్యాక్సీన్లను కూడా పెద్ద మొత్తంలో తెలంగాణకు సరఫరా చేయాలని సిఎం కోరిన నేపథ్యంలో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. సెకండ్ డోస్ కు ప్రాధాన్యతనివ్వాల్సిందిగా కేంద్రమంత్రి సిఎం కేసిఆర్ ను కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ డోస్ కే ప్రాధాన్యతనిస్తున్నదని సిఎం కెసిఆర్ స్సష్టం చేశారు. అందరికీ కరోనా వైద్యం అందించాలని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. తెలంగాణ రాష్ర్టానికి తలకుమించిన భారం గా మారే పరిస్థితి వుంటుందని, అందులో భాగంగా, కరోనా నియంత్రణకోసం ఆక్సీజన్, రెమిడెసివర్, వాక్సిన్లను తెలంగాణకు తక్షణమే సరఫరా చేయాలని, ప్రధాని నరేంద్ర మోడీ తనకు ఆదేశాలు జారీచేసినట్టు గా, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సిఎం కెసిఆర్ కు వివరించారు.

Next Story
Share it