బిఆర్ఎస్ నేతల విచిత్రాలు

ఒకప్పుడు టీడీపీని, చంద్రబాబు ను తీవ్రంగా వ్యతిరేకించిన బిఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఎన్నికలు వచ్చే సరికి టీడీపీ ఓట్ల కోసం నానా తిప్పలు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే మంత్రి కేటీఆర్ చంద్రబాబు అరెస్ట్ విషయం తమకు సంబంధం లేదు అని ...అది ఆంధ్ర ప్రదేశ్ గొడవ అంటూ వ్యాఖ్యానించారు. తర్వాత కొంత మంది ఐటి ఉద్యోగులు హైదరాబాద్ లో నిరసనలు చేయగా..ఇక్కడ ఎలా చేస్తారు...ఆంధ్ర ప్రదేశ్ లోని రాజమండ్రిలోనే, విశాఖపట్నంలో, విజయవాడలో చేసుకోవాలంటూ కామెంట్ చేయటం..అది పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో దీనిపై పెద్ద ట్రోలింగ్ సాగగా తర్వాత బిఆర్ఎస్ నేతలు గొంతు సవరించుకున్నారు. టీడీపీ ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాలకు చెందిన బిఆర్ఎస్ మంత్రులు...ఎమ్మెల్యేలు చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అయితే బిఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఈ సారి వారి ఓట్లు ఏ మాత్రం బిఆర్ఎస్ వైపు మొగ్గే అవకాశం లేదు అనే అంచనాలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కానీ ఈ లెక్కలు తేలవు. ఎన్నికల లోపు ఇంకా బిఆర్ఎస్ నేతలు ఎన్ని విచిత్రాలు చేస్తారో చూడాలి.