Telugu Gateway
Telangana

బిఆర్ఎస్ కు సిట్టింగ్ ఎంపీ గుడ్ బై

బిఆర్ఎస్ కు సిట్టింగ్ ఎంపీ గుడ్ బై
X

లోక్ సభ ఎన్నికల ముందు తెలంగాణాలో ప్రతిపక్ష బిఆర్ఎస్ కు షాక్. ఆ పార్టీ కి చెందిన సిట్టింగ్ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీ లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె సి వేణు గోపాల్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. తర్వాత వీళ్ళు అందరూ కలిసి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే తో కూడా సమావేశం అయ్యారు. పెద్దపల్లి ఎంపీ తో పాటు మహబూబ్ నగర్ కు చెందిన కొంత మంది కొంత మంది బిఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ లో చేరారు.

లోక్ సభ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తాం అని బిఆర్ఎస్ నేతలు ప్రకటిస్తున్న వేళ సిట్టింగ్ ఎంపీ జంప్ అవటం కీలకంగా మారింది. అయితే కొంత మంది నేతలు మాత్రం గత కొంత కాలంగా పెద్దపల్లి ఎంపీ పార్టీ కి దూరంగా ఉన్నారు అని చెపుతున్నారు. పైకి ఎన్ని మాటలు చెపుతున్నా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై ఉన్న బిఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో కూడా ప్రతికూల ఫలితాలనే చవి చూడాల్సి ఉంటుంది అనే అంచనాలు వెలువడుతున్నాయి.

Next Story
Share it