Telugu Gateway
Telangana

కెసీఆర్ కు స‌మాధానం చెప్ప‌క్క‌ర్లేదు

కెసీఆర్ కు స‌మాధానం చెప్ప‌క్క‌ర్లేదు
X

బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజ‌య్ కీలక వ్యాఖ్య‌లు చేశారు. బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు..బ‌హిరంగ స‌భ సూప‌ర్ స‌క్సె కావటం, ప్ర‌ధాని మోడీ బ‌హిరంగంగా సంజ‌య్ కు ప్ర‌శంస‌లు తెల‌ప‌టంతో ఆయ‌న దూకుడు మరింత పెంచిన‌ట్లు క‌న్పిస్తోంది. బేగంపేట విమానాశ్ర‌యంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం ఎవరు కౌన్ కిస్కా.. కేసీఆర్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. ముందు తెలంగాణ ప్రజలకు కేసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.'ప్రజల వద్ద మొహం లేక రాష్ట్ర ముఖ్యమంత్రి పారిపోతున్నారు.

మోదీని ఎదుర్కోడానికి ఫ్లెక్సీల కోసం పెట్టిన డబ్బులను ప్రజల కోసం ఖర్చు పెట్టు కేసిఆర్. నిన్నటి ప్రధాని సభకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నాం. కేసిఆర్ మీద ఉన్న వ్యతిరేకత నిన్నటి విజయ సంకల్ప సభతో మరోసారి బహిర్గతం అయింది. కేసీఆర్ తప్పుడు విధానాల పలితమే నిన్నటి సభ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలే తమకు బాస్‌లు అన్నారు. తెలంగాణ సమాజానికి తమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం చెప్పారని పేర్కొన్నారు.

Next Story
Share it