Telugu Gateway
Telangana

డ‌బ్బుల‌తో ఓట్లు కొన‌లేర‌ని హుజూరాబాద్ ఓట‌ర్లు చెప్పారు

డ‌బ్బుల‌తో ఓట్లు కొన‌లేర‌ని హుజూరాబాద్ ఓట‌ర్లు చెప్పారు
X

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల తీరుపై తెలంంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ స్పందించారు. బిజెపి అక్క‌డ భారీ మెజారిటీతో విజ‌యం సాధించ‌బోతున్నార‌ని ధీమా వ్య‌క్తం చేశారు. డ‌బ్బులు ద్వారా..అహంకారం ద్వారా గెల‌వాల‌ని చూసిన ముఖ్య‌మంత్రికి తాము నిజాయ‌తీప‌రులం..డ‌బ్బుల‌తో మా ఓట్లు కొనుగోలు చేయ‌లేర‌ని హుజూరాబాద్ ఓట‌ర్లు చెప్పి త‌మ ఓట్ల ద్వారా చూపించారన్నారు. హుజూరాబాద్ ప్ర‌జ‌లకు సెల్యూట్ చేస్తున్నా అన్నారు. వీరోచిత పోరాటం చేసిన బిజెపి కార్య‌క‌ర్త‌లు అంద‌రికీ రాష్ట్ర శాఖ త‌ర‌పున అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నామ‌న్నారు. హుజూరాబాద్ గ‌డ్డ మీద కాషాయ జెండా రెప‌రెప‌లాడిస్తున్నామ‌న్నారు.

హుజూరాబాద్ గెలుపు బిజెపిది కాదు..ఈటెల‌ది అంటున్నారంటూ మీడియా ప్ర‌శ్నించ‌గా..గెలిచాక ఇలాగే మాట్లాడ‌తార‌ని అన్నారు. ఈటెల రాజేంద‌ర్ బిజెపి గుర్తుపై పోటీచేశార‌న్నారు. తమ పార్టీ నాయ‌కుడు అన్నారు . ఎవ‌రు ఏమ‌న్నా తాము, ఈటెల రాజేంద‌ర్ ప‌ట్టించుకోమ‌న్నారు. ముఖ్య‌మంత్రిపై ప్ర‌జ‌లుకు న‌మ్మ‌కం లేకుండా పోయింద‌న్నారు. పేద‌లు అస‌లు సీఎంను న‌మ్మ‌ర‌ని అని వ్యాఖ్యానించారు. పేద‌ల‌కు అండ‌గా ఉండేవారినే ఆద‌రిస్తారు..అండ‌గా ఉంటారు..గెలిపిస్తారు అని చెప్పారు.

Next Story
Share it