Telugu Gateway
Politics

వైఎస్ ను విమ‌ర్శిస్తే మ‌ర్యాద ఉండ‌దు

వైఎస్ ను విమ‌ర్శిస్తే మ‌ర్యాద ఉండ‌దు
X

తెలంగాణ నేత‌ల విమ‌ర్శ‌ల‌పై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ ప‌ర్స‌న్ రోజా తీవ్రంగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని విమర్శిస్తే తెలంగాణ నాయకులకు మర్యాద ఉండదని హెచ్చరించారు. తెలంగాణ అక్రమంగా నీటి జలాలను వాడుకోవడం ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చెయ్యడమే అన్నారు. ఏపీకీ అన్యాయం చేస్తే సీఎంతో పాటు తాము సహించమని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన నీటి వివాదాన్ని పరిష్కరించి...తమ వాటాను తమకు కేటాయించాలని మోదీ, షేకావత్‌కు సీఎం జగన్ లేఖ రాశారని చెప్పారు. ఏపీ నీటిని వినియోగిస్తూ చేస్తున్న విద్యుత్ ఉత్పాదన కృష్ణా నీటి బోర్డు నిర్ణయానికి వ్యతిరేకమని ఎమ్మెల్యే అన్నారు. ఏపీకి అన్యాయం చేయ‌వ‌ద్ద‌ని చేతులు జోడించి అడుగుతున్న‌ట్లు వ్యాఖ్యానించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల భద్రత కోసం రాష్ట్రంలో సీఎం జగన్ దిశా చట్టం, యాప్, పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చారని తెలిపారు. మహిళల భద్రతను పట్టించుకోని చంద్రబాబును ప్రశ్నించని తెలుగు మహిళలు... జగన్‌ను విమర్శించడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. మహిళలు కోసం జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తున్నారని చెప్పారు. కరోనా బారిన పడ్డ వారికి న్యాయం చేయాలంటూ బాబు దొంగ దీక్షలు చేశారని....ఈ దీక్షలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే రోజా తెలిపారు.

Next Story
Share it