Telugu Gateway
Politics

'సాక్షి'పై షర్మిల సెటైర్లు

సాక్షిపై షర్మిల సెటైర్లు
X

వైఎస్ షర్మిల 'సాక్షి'కి షాక్ ఇచ్చారు. గురువారం నాడు షర్మిల హైదరాబాద్ లో తెలంగాణలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ నిరాహారదీక్షకు దిగారు. ఈ కార్యక్రమంలో షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ కూడా పాల్గొన్నారు. షర్మిల వేదికకు మీడియా ప్రతినిధులు అడ్డం నిలబడటంతో ఆమె వాళ్లను పక్కకు తప్పుకోవాలని కోరారు. తాను దీక్ష చేస్తున్నది మీ కోసమా..జనాల కోసం అని ప్రశ్నించారు.

సహకరించండి ప్లీజ్..మధ్యలో ఉన్న ఐదు కెమెరాలు తీసి కొంచెం అటు..కొంచెం ఇటు మారండి అంటూ కోరారు. మీ కవరేజ్ ఇక చాల్లే అంటూ..సాక్షి ఎట్లా మాకూ కవరేజ్ ఇవ్వదుగా అంటూ షాకిచ్చారు. షర్మిల వ్యాఖ్యలకు పక్కనే ఉన్న వైఎస్ విజయమ్మ అవాక్కు అయ్యారు. వెంటనే ఆమె షర్మిల కాలుపై తట్టారు. ఈ పరిణామం అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Next Story
Share it