ఆమె తాజా నిర్ణయంతో పలు అనుమానాలు
ఎందుకంటే వై ఎస్ అభిమానులు కొంత మంది ఓటు వేసినా కాంగ్రెస్ కు రావాల్సిన ఓట్లు అటు వైపు వెళ్ళినట్లే. రాజ్య సభ ఆఫర్, ఆంధ్ర ప్రదేశ్ పీసిసి పదవి వంటి వాటిని షర్మిల వదులు కున్నారు అంటే దీని వెనక ఏదో బలమైన కారణాలు ఉండి ఉంటాయనే చర్చ కూడా సాగుతోంది. నిజంగా షర్మిల కు జగన్ తో విబేధాలు ఉండి ఉంటే ఆమె కాంగ్రెస్ ఆఫర్ ను తిరస్కరించే వారు కాదు అని...ఎందుకంటే ఇప్పుడు దేశంలో కూడా ఆ పార్టీ గతంతో పోలిస్తే బలపడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్న వేళ షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే ఇది ఎంతో కీలకం అని ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. ఓట్లు చీలితే అది కెసిఆర్ కే లాభం, మళ్ళీ బిఆర్ఆర్ పార్టీ వస్తుంది అని చెపుతూనే 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పటం వెనక మతలబు ఏమిటి?. పోనీ షర్మిల ఎన్నికలకు ముందు నుంచి రంగం సిద్ధం చేసుకుని ఈ మాట అని ఉంటే పెద్దగా ఎవరు ప్రశ్నించే వారు కాదు. కానీ చర్చలు విఫలం అయిన తర్వాత ఆమె ఈ మాటలు అనటంతోనే షర్మిలను ఏవో అదృశ్య శక్తులు నడిపిస్తున్నాయి అనే చర్చలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. నిజంగా గెలుపు దిశగా ఆలోచించే వాళ్ళు అయితే తమకు ఎక్కెడెక్కడ విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయో లెక్కలు వేసుకుని వాటిపైనే ఫోకస్ పెడతారు. కానీ షర్మిల అందుకు బిన్నంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణాలో తామే అధికారంలోకి వస్తామని చెప్పుకునే బీజేపీ కే బలమైన అభ్యర్థులు కరువయ్యారు అని చెపుతున్నారు. అలాంటిది షర్మిలకు దొరికే అభ్యర్థులు ఎవరు...వాళ్ళు సాధించే ఓట్లు ఎన్ని అనేది ఎన్నికల తర్వాత కానీ తేలదు.