Telugu Gateway
Politics

ఒంటరిన‌య్యానంటున్న ష‌ర్మిల‌

ఒంటరిన‌య్యానంటున్న ష‌ర్మిల‌
X

వైఎస్ఆర్ టీపీ నాయ‌కురాలు వై ఎస్ ష‌ర్మిల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దివంగ‌త రాజశేఖ‌రరెడ్డి వర్ధంతి సంద‌ర్భంగా ఆమె చేసిన ట్వీట్ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ ట్వీట్ సారాంశం ఏంటో చూడండి. 'ఒంటరి దానినైనా విజయం సాధించాలని, అవమానాలెదురైనా ఎదురీదాలని, కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని, ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు.

నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది. I Love & Miss U DAD' అని పేర్కొన్నారు. ష‌ర్మిల పార్టీ పెట్టిన త‌ర్వాత తొలిసారి ఇడుపుల‌పాయ‌లో ఒకేసారి వైఎస్ కు నివాళులు అర్పించారు. కుటుంబ స‌భ్య‌లు అంద‌రూ క‌ల‌సి వైఎస్ కు నివాళి అర్పించే కార్య‌క్ర‌మంలో పాల్గొన్నా సీఎం జ‌గ‌న్, ష‌ర్మిల‌లు ప‌ల‌క‌రించుకోలేదు.

Next Story
Share it