Telugu Gateway
Politics

చంద్ర‌బాబుపై విజ‌య‌సాయిరెడ్డి వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

చంద్ర‌బాబుపై విజ‌య‌సాయిరెడ్డి వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు
X

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబుపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. 'తల్లి పాలు తాగి రొమ్ముగుద్దినట్లు పిల్లను, పదవిని ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం. చిత్తూరు జిల్లాలో 1.10లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే 3 రిజర్వాయిర్లను అడ్డుకునేందుకు ఎన్జీటీలో పిటిషన్లు వేయించాడు. నీకెందుకు జన్మనిచ్చానా అని సొంత జిల్లా కన్నీరు పెడుతోంది బాబూ!' అంటూ ట్విట్ట‌ర్ లో కామెంట్ పోస్ట్ చేశారు.

మ‌రో ట్వీట్ లో అప్పట్లో మహానేత వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞంను ప్రసాద్ నాయుడు చేత కేసులు వేయించి రెండేళ్లు అడ్డుకున్నాడు చంద్రబాబు. ఇప్పుడేమో సీమ ఎత్తిపోతల పథకంతో పాటు జగన్ గారు మొదలు పెట్టిన చిత్తూరు ప్రాజెక్టులపై స్టే కోరుతూ తన వాళ్ళతో గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్లు వేయించాడు రైతు ద్రోహి అంటూ వ్యాఖ్యానించారు.

Next Story
Share it