Telugu Gateway
Politics

కిడ్నాప్ కేసు

కిడ్నాప్  కేసు
X

గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తో పాటు మొత్తం 88 మందిపై పోలీసులు కేసు పెట్టారు. టీడీపీ గన్నవరం కార్యాలయంలో పని చేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదు మేరకు పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. అయితే హఠాత్తుగా ఫిర్యాదు దారుడు సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చి అధికార టీడీపీ కి షాక్ ఇచ్చాడు. రెండు రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు. ఇది రాజకీయ వర్గాల్లో పెద్ద కలకలం రేపింది.

అయితే సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకొనేలా చేశారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సత్యవర్ధన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తనను వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా చేశారని ఆయన చెప్పారు. దీంతో వల్లభనేని వంశీ ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సత్య వర్ధన్‌ను ఆ రోజు వంశీ అనుచరులు కారులో కోర్టుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించి మొత్తం ఐదుగురుపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.

సెక్షన్స్ ఇవే

వల్లభనేని వంశీపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాురు. BNS సెక్షన్‌ 140(1), 308, 351(3), రెడ్‌ విత్‌ 3(5) కింద కేసులు నమోదు చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. విజయవాడ పటమట పోలీస్ లు ఈ కేసులు నమోదు చేశారు. వంశీని గచ్చిబౌలి నుంచి విజయవాడ తరలిస్తున్న ఏపీ పోలీసులు.. .కుటుంబ సభ్యులకు ఈ మేరకు నోటీసు ఇచ్చారు.

Next Story
Share it