Telugu Gateway
Politics

బండి సంజయ్ కు ప్రజలే బుద్దిచెప్తారు

బండి సంజయ్ కు ప్రజలే బుద్దిచెప్తారు
X

ముఖ్యమంత్రి కెసీఆర్ ఢిల్లీ పర్యటనపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విమర్శలపై అధికార టీఆర్ఎస్ స్పందించింది. ఈ అంశంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కాంత్రి తదితరులు మీడియాతో మాట్లాడారు. 'రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ,పెండింగ్ బకాయిలు ,రాష్ట్ర ప్రాజెక్టుల పై ప్రధాని ,కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్ కలిశారు . రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు అనేకం ఉంటాయి.. వాటి లో భాగంగానే కేసీఆర్ ఢిల్లీ వెళ్ళారు..కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏం చేశారని ప్రశ్నిస్తున్ళ బండి సంజయ్ కు ఢిల్లీ లో ఏం జరిగిందో తెలియదా..ఎంపీ గా ఉన్న వ్యక్తి కి కేంద్ర ,రాష్ట్ర సంబంధాలు తెలియవా..అవగాహన లేదా ? బండి సంజయ్ అడిగాడని కాదు. రాష్ట్ర ప్రజలకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. ఎన్నో రకాల పదవులు అనుభవించిన వ్యక్తి కేసీఆర్..ఆయన గురించి మాట్లాడే ముందు ఆచి తూచి మాట్లాడండి.

స్థాయి లేని వాళ్ళు అంతా ..కేసీఆర్ గురించి మాట్లాడేవారే..కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగనట్లుగా బండి సంజయ్ ఎగిరెగిరి పడుతున్నారు..అర్ధరహితంగా మాట్లాడుతున్నారు. మా పార్టీ నాయకత్వం ,కేసీఆర్ గురించి మాట్లాడే ముందు అవగహన పెంచుకొని మాట్లాడాలి. రాజ్యాంగ బద్ద వ్యవస్థ ల పై బండి సంజయ్ అవగాహన పెంచుకోవాలి. బండి సంజయ్ తన పద్దతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెపుతారు..పీఎం తో సీఎం లు కలవడం సాధారణ విషయం' అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని..సీఎం కెసీఆర్ జైలుకు వెళ్లటం ఖాయం అని బండి సంజయ్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వంగి వంగి దండాలు పెట్టినా కూడా కెసీఆర్ ను ఎవరూ కాపాడలేరని వ్యాఖ్యానించారు.

Next Story
Share it