Telugu Gateway
Politics

అమిత్ షా తో సీఎం కెసీఆర్ భేటీ

అమిత్ షా తో సీఎం కెసీఆర్ భేటీ
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ శుక్రవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యంగా ఇటీవల హైదరాబాద్ ను ముంచెత్తిన వరదలకు సంబంధించి కేంద్ర సాయం గురించి ప్రస్తావించినట్లు సమాచారం. వరద సాయం కింద తమకు 1300 కోట్ల రూపాయలు కేటాయించాలని ఇప్పటికే సీఎం కెసీఆర్ చాలా రోజుల క్రితమే ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.

వరదల సాయంతోపాటు పోలీసు వ్యవస్థ ఆధునికీకరణ, వెనకబడిన జిల్లాల కు అందాల్సిన సాయం తదితర అంశాలపై వీరిద్దరూ చర్చించినట్లు చెబుతున్నారు. అంతకు ముందు కెసీఆర్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ముఖ్యంగా కృష్ణా, గోదావరి జలాల వివాదాలపై మాట్లాడినట్లు సమాచారం. తెలంగాణ, ఏపీల మధ్య పలు ప్రాజెక్టుల విషయాలపై వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే.

Next Story
Share it