Telugu Gateway
Politics

మండ‌ల కేంద్రాల్లో నిర‌స‌న‌ల‌కు కాంగ్రెస్ పిలుపు

మండ‌ల కేంద్రాల్లో నిర‌స‌న‌ల‌కు కాంగ్రెస్ పిలుపు
X

టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు హైద‌రాబాద్ లోని జూబ్లిహిల్స్ లో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిని ముట్ట‌డించేందుకు ప్ర‌య‌త్నించారు. ఇందుకు ప్ర‌తిగా మండ‌ల కేంద్రాల్లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో రేవంత్ రెడ్డి ఇంటిపై టిఆర్ఎస్ గుండాల దాడికి నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాల‌ని కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి కోరారు.

మంత్రి కేటీఆర్ కు వైట్ ఛాలెంజ్ విసిరి డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చేయాలన్న సదుద్దేశంతోనే నిన్న గన్ పార్క్ వద్ద టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నం తో ఉలిక్కి పడ్డ టిఆర్ఎస్ గుండాలు ఈ రోజు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంటిపై దాడి చేశార‌న్నారు. ఈ అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేయాల‌న్నారు.

Next Story
Share it