Telugu Gateway
Politics

కెసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు

కెసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు
X

తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య కొంతమంది సీఎం కేసీఆర్‌ను‌ ఇబ్బందులకు గురి చేయాలని, బలహీనపరచాలని చూస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ని బలహీనపరిస్తే తెలంగాణ సమాజమే బలహీనం అయినట్లు అవుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణలో ఎక్కడి గొంగడి అక్కడే అన్న చందంగా మారిపోతుందని తెలిపారు. రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.

ఆయన గురువారం నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వనికి ,అధికారులకు సహకరించాలన్నారు. రైతులు ఆందోళన చెందొద్దు, సీఎం కేసీఆర్ ఉండగా రైతులకు ఎలాంటి ఇబ్బంది రాదని తెలిపారు. కొన్ని పార్టీలు విద్వేష పూరితంగా, ప్రజల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ప్రకటనలు చేస్తున్నాయని, ఇది దురదృష్టకరమని తెలిపారు. జాతీయ స్థాయిలో తెలంగాణకు గొప్ప పేరుప్రఖ్యాతులు ఉన్నాయని, అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాన్ని చెడగొట్టవద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు అత్యంత సహజమని, అంతిమంగా ప్రజల సంక్షేమం కోసమే అందరూ పాటుపడాలన్నారు.

Next Story
Share it