చంద్రబాబుకు భద్రత పెంపు..కీలక పరిణామం

తాజాగా ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇరు పార్టీల కార్యకర్తలు బాహబాహీకి కూడా దిగారు. గతంలో ఏకంగా చంద్రబాబు నివాసంపైకే వైసీపీ కార్యకర్తలు వెళ్లారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేశారు. ఈ తరుణంలో కేంద్రం చంద్రబాబుకు భద్రత పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న సంఖ్య కంటే ఆయనకు అదనపు ఎన్ ఎస్ జీ కమాండోలను జత చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బిజెపి, జనసేన కలసి పోటీచేస్తాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ భద్రత పెంపు కూడా రాజకీయంగా కూడా చర్చకు కారణమవుతోంది. చంద్రబాబు విషయంలో బిజెపి సానుకూలంగా ఉండటం వల్లే తాజా పరిణామాలను కూడా గమనంలోకి తీసుకుని ఆయనకు భద్రత పెంచిందనే చర్చ సాగుతోంది. అయితే పూర్తిగా భద్రతా కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నారా లేక ఇందులో రాజకీయ కారణాలు కూడా ఉన్నాయా అన్నది తేలాలంటే కొంత సమయం ఆగాల్సిందే.