Telugu Gateway
Politics

టీడీపీకి ఎస్ఈసీ షాక్..మ్యానిఫెస్టో రద్దు

టీడీపీకి ఎస్ఈసీ షాక్..మ్యానిఫెస్టో రద్దు
X

తెలుగుదేశం పార్టీకి ఎస్ఈసీ షాకిచ్చింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోను రద్దు చేసింది. దీన్ని ప్రచారం చేయకూడదని..జిల్లాలకు పంపిన వాటిని కూడా వెనక్కి తెప్పించాలని ఆదేశించింది. టీడీపీ ఈ మ్యానిఫెస్టోపై ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవటంతో ఎస్ఈసీ తాజా నిర్ణయం తీసుకుంది. టీడీపీ మేనిఫెస్టోతో ఎలాంటి ప్రచారం నిర్వహించొద్దని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.

పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టో ప్రకటించడంపై దుమారం రేగింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై ఎస్‌ఈసీకి అధికార వైసీపీ ఫిర్యాదు చేయగా... మేనిఫెస్టోపై టీడీపీని ఎస్‌ఈసీ వివరణ కోరింది. తాజాగా మ్యానిఫెస్టో రద్దుకు నిర్ణయం తీసుకుంది. టీడీపీ తన మ్యానిఫెస్టోలో కూడా విచిత్రమైన హామీలు గుప్పించింది.

Next Story
Share it