Telugu Gateway
Politics

ద‌ళిత బంధు కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను నిల‌దీయండి

ద‌ళిత బంధు కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను నిల‌దీయండి
X

ప్ర‌తి ఒక్క‌రూ ప‌ది ల‌క్షలు ఇస్తావా..చ‌స్తావా అని డిమాండ్ చేయాలి

ద‌ళిత‌, గిరిజ‌న దండోరాల‌తో కెసీఆర్ గ‌డీల‌ను ప‌గ‌ల‌గొడ‌తాం

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోని ద‌ళితులు అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను ప‌ది ల‌క్షల రూపాయ‌లు డిమాండ్ చేయాల‌ని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సూచించారు. హుజూరాబాద్ లో ఇవ్వ‌నున్న‌ట్లు త‌మ‌కు కూడా ఇస్తావా..చ‌స్తావా అని డిమాండ్ చేయాల‌న్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్.. హరితహారం పేరుతో పోడు భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు కేసీఆర్ ద‌ళితుల‌కు ఎన్ని భూములు పంచారో శ్వేత పత్రం విడుదల చెయ్యాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. దళితులకు 10లక్షలు ఇస్తామంటే.. కెసీఆర్ ను ఎవ‌రు అడ్డుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలయ్యే విధంగా చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాలను పెట్టు.. దళిత బంధుపై ఏకగ్రీవ తీర్మానం చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు.

ట్యాంక్ బండ్ పక్కనే ఉన్న సచివాలయం భూములని, లేదంటే ప్రగతి భవన్‌ను అమ్మి ఇచ్చిన త‌మ‌కు అభ్యతరం లేదన్నారు.దళిత, గిరిజన దండోరా చేసి.. కేసీఆర్ గడీలను పగలగొడతామని హెచ్చరించారు. ద‌ళిత బంధు కోసం నియోజక వర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను నిలదీయాలన్నారు. ప్రపంచ గిరిజన దినోత్సవం ఆగస్ట్ 9 నుంచి దళిత గిరిజన దండోరాను మొదలుపెట్టబోతున్నామని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అధిష్ఠానం దళిత, గిరిజన దండోరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రేవంత్‌రెడ్డి తెలిపారు.ఇందిరమ్మ రాజ్యంలో దళిత, గిరిజనులకు భూములు ఇస్తే.. కేసీఆర్ సర్కార్ పోలీసులతో దాడులు చేసి.. ఆ భూములను లాక్కుంటున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళిత బంధు పేరుతో సీఎం కేసీఆర్ మరోసారి దళితులను మోసం చేసే కుట్ర చేస్తున్నారని విమ‌ర్శించారు.

Next Story
Share it