Telugu Gateway
Politics

టీఆర్ఎస్ వాళ్ళను రాళ్లతో కొట్టండి

టీఆర్ఎస్ వాళ్ళను రాళ్లతో కొట్టండి
X

కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం వచ్చే టీఆర్ఎస్ వాళ్లను రాళ్ళతో కొట్టాలన్నారు. 'ఎప్పుడో తీసుకున్న ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ పేరుతో మళ్ళీ డబ్బులు కట్టమంటున్నడు కేసిఆర్. గల్లీలకు టిఆర్ఎస్ వాళ్లు వస్తే పిచ్చి కుక్కను ఎట్లా రాళ్లతో కొడతమో అట్ల కొట్టురి. పదివేల వరద సాయంలో 2,3 వేలు ఇచ్చి మిగిలినవి మెక్కిన్రు. ఈ ఎన్నికలు సిఎం, పిఎం ను ఎన్నుకునేవి కావు. సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్లను ఎన్నుకోవాలి. ఇంటిముందు కంకర కుప్ప పడ్డా, ఇసుక లారీ వచ్చినా టిఆర్ఎస్ వాళ్లకు కప్పం కట్టాల్సిందే. 20లక్షల కోట్ల బడ్జెట్ మోడీ చేతిలో ఉంది కదా? వరదలల్లో ఒక్కపైసా ఎందుకు తేలేకపోయిన్రు బిజేపి వాళ్లు. మోదీ చేయలేని పనిని గీ బోడి మేయర్ చేస్తడా? కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా 10వేల కోట్లు తీసుకొచ్చి హైదరాబాద్ ను అద్దంలాగా చేయొచ్చుగా. ఎందుకు చేస్తలేరు.

కిషన్ రెడ్డి చేయని పనిని కార్పొరేటర్ చేస్తడా? జిహెచ్ఎంసిలో కౌరవులు లాగా నూరు మంది టిఆర్ఎస్ కార్పొరేటర్లు, 50 మంది ఎంఐఎం కార్పొరేటర్లు, 45 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు, 50 మంది అధికారులు ఒక పక్క కూసుంటే నేను ఒక్కడిని ఒకపక్క ఉండి ప్రజల కోసం కొట్లాడుతున్న. కేసిఆర్ నగర్, కేటిఆర్ నగర్ అని బస్తీలకు ఆ సన్నాసుల పేర్లు పెట్టుకున్నరు కానీ వరద సాయం నయా పైసా ఇయ్యలే. కాంగ్రెస్ రామంతపూర్ డివిజన్ అభ్యర్థి సౌమ్యను గెలిపించండి మీకు కొట్లాడి వరద సాయం ఇప్పిస్తా. నన్ను బలోపేతం చేయండి. నాకు పాతిక 30 మందిని గెలిపించి ఇవ్వండి. కడుపులో పేగులు తెగే వరకు కొట్లాడతా.' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story
Share it