పీకె వ్యవహారంపై రేవంత్ స్పందన
BY Admin26 April 2022 12:37 PM GMT
X
Admin26 April 2022 12:37 PM GMT
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరటంలేదనే అంశంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో టీఆర్ఎస్ తో జట్టుకట్టే ఎవరితోనైనా తాము విభేదిస్తామని తెలిపారు. ఎందుకంటే ఇది రాష్ట్రానికి ప్రమాదకరం అన్నారు. కాంగ్రెస్ లో చేరితే మిగిలిన పార్టీలకు దూరంగా ఉండాల్సిందనే షరతు పెట్టామని..అందుకే ప్రశాంత్ కిషోర్ దూరంగా వెళ్లారన్నారు. ప్రశాంత్ కిషోర్ తో తమకు వ్యక్తిగతంగా గట్టు పంచాయతీలు ఏమి ఉన్నాయని..టీఆర్ఎస్ పార్టీతో కలసి తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నారనే అంశంపైనే తాము స్పందిస్తామన్నారు.
Next Story