Telugu Gateway
Politics

పీకె వ్య‌వ‌హారంపై రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పీకె వ్య‌వ‌హారంపై రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

తెలంగాణ కాంగ్రెస్ లో దుమారం రేపుతున్న ప్ర‌శాంత్ కిషోర్ వ్య‌వ‌హారంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్‌తో తెగతెంపులు చేసుకునేందుకే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా సీఎం కేసీఆర్‌ను కలిశారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌తో పీకే భేటీపై సోమవారం రేవంత్ రెడ్డి మీడియతో మాట్లాడుతూ.. ఇక ప్రశాంత్ కిషోర్‌కు టీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం ఉండదని అన్నారు. ఐప్యాక్‌కు పీకేకు ఇక ఎలాంటి సంబంధం ఉండదని తెలిపారు.

తాను ముందు నుంచి చెప్పిందే ఇప్పుడు జరిగిందని పేర్కొన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరాక తెలంగాణ రాష్ట్రానికి వచ్చి.. తనతో కలిసి ఉమ్మడి ప్రెస్‌మీట్ కూడా పెట్టే రోజు దగ్గరలోనే ఉందని తెలిపారు. ఆ రోజు పీకే స్వయంగా టీఆర్ఎస్‌ను ఓడించండని ఆయన నోటి నుంచి చెప్పడం మీరు వింటారని పేర్కొన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరాక ఆయనకు పార్టీ అధిష్టానం మాటనే ఫైనల్‌గా ఉంటుందని తెలిపారు.

Next Story
Share it