Telugu Gateway
Politics

ఇద్దరు సీఎంలు సమస్య పరిష్కరించాలి

ఇద్దరు సీఎంలు సమస్య పరిష్కరించాలి
X

ఏపీ నుంచి హైద‌రాబాద్ కు చికిత్స కోసం వ‌చ్చే క‌రోనా రోగుల అంబులెన్సుల‌ను చెక్‌పోస్టుల్లో అడ్డుకోవ‌డం స‌రికాదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మాన‌వీయ కోణంలో ఆలోచించి ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు త‌క్ష‌ణం ఈ స‌మ‌స్య ప‌రిష్కారంపై దృష్టి సారించాలన్నారు. ఏపీ క‌రోనా రోగుల‌కు తెలంగాణ‌లోకి అనుమ‌తి లేక పోవ‌డంతో ఎస్‌.శివారెడ్డి అనే వ్య‌క్తిని క‌ర్నూలు ఆస్ప‌త్రిలో చేర్పించారని తెలిపారు. క‌రోనా రోగుల అనుమ‌తి విష‌యంలో నెల‌‌కొన్న ప్ర‌తిస్టంభ‌న తొల‌గించే దిశ‌గా రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు.

Next Story
Share it