మోడీ వ్యాఖ్యలు ఆ విషయాన్ని తేల్చాయి
BY Admin9 Feb 2022 7:20 AM GMT
X
Admin9 Feb 2022 7:20 AM GMT
తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలపై ఆయన మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. మోడీ హేట్స్ తెలంగాణ హ్యాష్ టాగ్తో రేవంత్ ట్వీట్ చేశారు. ''పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసంగంలో రెండు వాస్తవాలు బట్టబయలు అయ్యాయి. తెలంగాణ ఆవిర్భావం కాంగ్రెస్ తోనే జరిగింది… టీఆర్ఎస్ పాత్ర లేదు. తెలంగాణ పట్ల బీజేపీ ద్వేషభావాన్ని ప్రదర్శిస్తోంది… తెలంగాణ కోసం బీజేపీ చేసింది శూన్యం. తెలంగాణ అమరవీరుల ఆత్మక్షోభించేలా, వారి త్యాగాలను కించపరిచేలా మోడీ వ్యాఖ్యలు ఉన్నాయి. తెలంగాణ సమాజానికి మోదీ క్షమాపణ చెప్పాలి'' అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.
Next Story