Telugu Gateway
Politics

డ్ర‌గ్స్ కేసులో పెద్ద‌ల హ‌స్తం..అందుకే ఈడీకి స‌హ‌కరించ‌ట్లేదు

డ్ర‌గ్స్ కేసులో  పెద్ద‌ల హ‌స్తం..అందుకే ఈడీకి స‌హ‌కరించ‌ట్లేదు
X

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మ‌రోసారి డ్ర‌గ్స్ అంశాన్ని లేవ‌నెత్తారు. ఈ అంశంపై ఆయ‌న శుక్ర‌వారం నాడు ఈడీ జాయింట్ డైర‌క్ట‌ర్ ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌తో కూడిన విన‌తిప‌త్రాన్ని అంద‌జేశారు. అనంత‌రం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. డ్ర‌గ్స్ కేసులో ప్ర‌భుత్వ పెద్ద‌ల ప్ర‌మేయం ఉంద‌ని..అందుకే ఎన్ ఫోర్స్ మెంట్ డైర‌క్ట‌రేట్ (ఈడీ)కి స‌హ‌రించ‌ట్లేదు అని ఆరోపించారు. మీడిచా స‌మావేశంలో రేవంత్ వ్యాఖ్య‌లు ఆయ‌న మాటల్లోనే...'కేసీఆర్ రాష్ట్రములో గుట్కా లేదు మట్కా లేదు గుడుంబా లేదు, పేకాట లేదు అని ఎన్నోసార్లు చెప్పారు. 2017 నుండి విచారణ అధికారులను నేను అప్రమత్తం చేస్తూనే ఉన్నా.డ్రగ్స్ మహమ్మారి విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున ఉంది. డ్రగ్స్ గురించి మేము మేము మాట్లాడితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతుందని కేటీఆర్, బాల్క సుమన్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ప్రగల్బాలు పలికారు. 2017 విచారణ ఏం అయింది... ఎందుకు అటక ఎక్కింది. ఆకున్ సభర్వాల్ ను అర్ధాంత‌రంగా ఎందుకు బదిలీ ఎందుకు చేశారు. అప్పుడు న‌మోదు అయిన 12 ఎఫ్ఐఆర్ లు ఏమ‌య్యాయి.

అన్నీ విచారణ సంస్థలకు ఫిర్యాదు చేశా అయినా కూడా ముందుకు రాలేదు. హై కోర్ట్ కు కూడా వెళ్లినా. ఈడీ వాళ్ళు విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నారు.రాష్ట్ర ప్రభుత్వం మా విచారణను వ్యతిరేకిస్తుంది అని చెప్తున్నారు. ఈడీ స్పష్టంగాచెప్పింది, ప్రభుత్వం సహకరించట్లేదని. ఎక్సైజ్ శాఖ ద‌గ్గ‌ర అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ ఈడీ వాళ్లకు ఇవ్వట్లేదు.సరఫరా చేసే వాళ్ళు, వాడిన వాళ్ళు, అమ్మే వాళ్ళు మూడు రకాల నేరస్థులు ఉన్నారు...డ్రగ్స్ కేసుల్లో. ఇతర దేశాల నుండి సప్లయ్ చేస్తున్నారు. మీరు సేకరించిన అన్ని ఆధారాలు, సాక్ష్యాలు, వెంటనే ఈడీ కి ఇవ్వండి. కోర్టు ఆదేశాలు పాటించండి . ఆధారాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి అభ్యంత‌రం అని అడుగుత‌న్నా. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతా అన్నారు... కానీ ఏం జరగలేదు మాటలే మిగిలాయి. దొరగారు లేచినపుడే ఊరు తెల్లారినట్లు ఉంది కేసీఆర్ కథ. 1000 మందితో ఒక విభాగం ఏర్పాటు చేశామని చెప్తున్నారు. మరీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఈడీ కి ఎందుకు సహకరించట్లేదు.

టోనీకి సంబందించిన డిజిటల్ డేటా ఇవ్వాలని కోరుతున్నాను. ప్రభుత్వం ఈడీకి తక్షణమే సహకరించాలి. పంజాబ్ లో డ్రగ్స్ వాడి యువత నాశనం అయింది.. తెలంగాణను మరో పంజాబ్ కానివ్వను. డ్రగ్స్ వాడే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే చర్యలు తీసుకోండి. సినీ పరిశ్రమ ప్రముఖులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను... డ్రగ్స్ వాడకుండా చూడండి. మీ ఇండస్ట్రీ లో కొంతమంది చేసే తప్పుల వల్ల మొత్తం ఇండస్ట్రీ కి బ్యాడ్ నేమ్ వస్తుంది... ఇండస్ట్రీ ని డ్రగ్స్ నుండి కాపాడండి. 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నది..రాసి పెట్టుకోండి. అధికారం లోకి వచ్చాక డ్రగ్స్ దొంగల అంతు చూస్తా.. చార్మినార్ దగ్గర గుడ్డలు ఉడదీసి కొడుతాం. 2023 మర్చి లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. డ్రగ్స్ వాడే వాళ్ళు డ్రగ్స్ వ్యాపారం చేసే వాళ్ళు ఏ బొక్కలో దాక్కున్న గుంజుకు వస్తాం.' అని ప్ర‌క‌టించారు.

Next Story
Share it