Telugu Gateway
Politics

రాకేష్ టికాయిత్ తో రేవంత్ రెడ్డి భేటీ

రాకేష్ టికాయిత్ తో రేవంత్  రెడ్డి భేటీ
X

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు ఢిల్లీ సరిహద్దులోని ఘాజీపూర్ వ‌ద్ద రైతు ఆందోళ‌న శిబిరం ద‌గ్గ‌ర రైతు సంఘం నాయ‌కుడు( బీకేయూ) రాకేశ్ టికాయిత్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో తాను నిర్వహించిన పది రోజుల పాదయాత్ర వివరాలను రేవంత్ రెడ్డి ఆయనకు వివరించారు. తన రైతు భ‌రోసా పాద‌యాత్ర‌కు రైతుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింద‌ని తెలిపారు.

మార్చి మొద‌టి వారంలో తెలంగాణ‌లో రైతు సంఘాల ఆధ్వ‌ర్యంలో భారీ బ‌హిరంగ స‌భ‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు హాజరుకావాల్సిందిగా టికాయిత్ ను రేవంత్ రెడ్డి ఆహ్వానించగా..ఆయన అందుకు సమ్మతి తెలిపారు. రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాల విజ్ఞ‌ప్తి మేర‌కు టికాయిత్ తో సమావేశం అయినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

Next Story
Share it