Telugu Gateway
Politics

రేవంత్ రెడ్డి వ‌ర‌స భేటీలు

రేవంత్ రెడ్డి వ‌ర‌స భేటీలు
X

బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ‌కు ముందే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు అంద‌రితో స‌మావేశం అవుతున్నారు. ఆయ‌న మంగ‌ళ‌వారం నాడు సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌తో స‌మావేశం అయ్యారు. ఈ భేటీకి ముందు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌తో ఆయ‌న సోద‌రుడు మ‌ల్లు ర‌వి స‌మావేశం కావ‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఆ త‌ర్వాత రేవంత్ రెడ్డి, మ‌ల్లు ర‌వి ఇద్ద‌రూ క‌ల‌సి భ‌ట్టితో స‌మావేశం అయ్యారు. టీపీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ నియామ‌కం త‌ర్వాత భ‌ట్టి ఢిల్లీ వెళ్లి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

రేవంత్ నియామ‌కంపై ఆయ‌న అనుకూలంగా కానీ..వ్య‌తిరేకంగా కానీ ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.. కానీ ఈ ప‌ద‌విని రేవంత్ రెడ్డికి ఇవ్వ‌టంపై మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క గ‌రం గ‌రంగానే ఉన్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయ‌న ఈ విష‌యాన్ని ఎక్క‌డా బ‌హిర్గ‌తం చేయ‌టం లేదు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి మ‌రో సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబుతో కూడా స‌మావేశం అయ్యారు. బుధ‌వారం నాడు బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్న ఆయ‌న అంద‌రిని క‌లుస్తూ వ‌స్తున్నారు.

Next Story
Share it