Telugu Gateway
Politics

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వ్యూహాత్మకమా..లేక!

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు  వ్యూహాత్మకమా..లేక!
X

కాంగ్రెస్ పార్టీ శిక్షణా శిబిరంలో బుధవారం నాడు పీసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి మాటలు విన్న తర్వాత చాలా మందికి వస్తున్న డౌట్ ఇది. కాంగ్రెస్ అధిష్టానం కొత్తగా ఎవరిని పీసిసి ప్రెసిడెంట్ గా నియమిస్తే తాను వాళ్ళ పల్లకి మోయటానికి కూడా సిద్దమే అన్నారు. అంతే కాదు...తాను దిగిపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే అందుకూ సై అంటూ వ్యాఖ్యానించారు. సహజంగా రేవంత్ రెడ్డి నోటి నుంచి ఇలాంటి మాటలు ఎవరూ ఉహించి ఉండరు. రేవంత్ రెడ్డి పీసిసి ప్రెసిడెంట్ గా ప్రకటించిన సమయంలో ఒక్కసారిగా పార్టీ లో జోష్ వచ్చింది. కానీ దాన్ని సొంత పార్టీ నేతలే విజయవంతంగా దెబ్బతీశారు. అదే సమయంలో సీఎం కెసిఆర్ కూడా అంతగా బలంగా లేని బీజేపీ నే తమ ప్రత్యర్థి అని చూపించే ప్రయత్నం చేసి...కాంగ్రెస్ సీన్ లో లేదు అని చూపే ప్రయత్నం చేశారు. దీనికి తోడు నిత్యం ఏదో ఒక వివాదం తెరపైకి తేవటం లాంటి అంశాలతో సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ ని దెబ్బతీశారు. ఈ తరుణంలో కాంగ్రెస్ సీనియర్లుగా చెప్పుకుంటున్న వారిపై కాంగ్రెస్ అభిమానుల్లో కూడా వ్యతిరేకత పెరిగింది. ఎన్నికలకు ఏడాది కూడా లేని సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానము పీసిసి మార్పు వంటి సాహసం ఇప్పుడు చేయకపోవచ్చు. ఇప్పుడు పార్టీ ఇంచార్జి ను మార్చటంతో దీనిపై క్లారిటీ కూడా వచ్చినట్లు అయింది. పల్లకి మోస్తా...పదవి వదిలేస్తా వంటి వ్యాఖల ద్వారా రేవంత్ రెడ్డి తాను కేవలం అధిష్టానం చెప్పింది చేయటానికే ఉన్నా తప్ప తనకు వేరే ఎజెండా లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు అని ప్రకటించటం ద్వారా వ్యూహాత్మక అడుగులు వేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సీనియర్ ల కోరిక మేరకు ఇంచార్జి ని మార్చటం తో సీనియర్ లు గా చెప్పుకుంటున్నవారు ఇప్పుడు అంతా కలిసి పనిచేయాల్సిన పరిస్థితీ. మరి ఇప్పటికైనా వీరిలో మార్పు వస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే. రేవంత్ రెడ్డి తాజా గా తన వ్యాఖల ద్వారా బాల్ ను బయటకు కొట్టారు. ఇప్పటికి సీనియర్లు కలిసిరాకపోతే వాళ్ళకే అది ప్రతికూలంగా మారే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. చాలాకాలంగా అధికార పార్టీ పై పోరాడాల్సిన కాంగ్రెస్ సీనియర్లు సొంత పార్టీ పై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలకాలంలో ఇది పీక్ కి వెళ్లటంతో కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపి నివేదిక తెప్పించుకుంది. దీనిపై యాక్షన్ కూడా ప్రారంభం అయింది. అందులో భాగంగానే ఇప్పటివరకు ఇంచార్జి గా ఉన్న మాణిక్యం ఠాగూర్ ప్లేస్ లో కొత్తగా మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత మాణిక్ రావు ఠాక్రే ను నియమించారు. రేవంత్ రెడ్డి పై కూడా ఎవరిని కలుపుకు పొరనే విమర్శలు ఉన్నాయి. అయన పీసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఫలితాలను చవిచూడడం ఆయనకు కొంత మైనస్ గా మారింది. రెండు సార్లు ఒరిజినల్ కాంగ్రెస్ వాదులే పీ ప్రెసిడెంట్ లు ఉన్నా సమయంలో పార్టీని అధికారంలోకి తీసుకురావటంలో ఫెయిల్ అయిన సీనియర్ నేతలు ఇప్పుడు మాత్రం ఒరిజినల్ నేతలు..వలస నేతలు అంటూ కొత్త రాగం అందుకున్నారు.

Next Story
Share it