Telugu Gateway
Politics

రేవంత్ రెడ్డి రూటు మార్చారెందుకు?

రేవంత్ రెడ్డి రూటు మార్చారెందుకు?
X

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సడన్ గా రూటు ఎందుకు మార్చారు?. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ప్రచార కమిటీ ఛైర్మన్ వైపు ఎందుకు మళ్లారు. అంతా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు అయిపోయినట్లు నిర్ణయానికి వచ్చారు. కానీ ఇప్పుడు సడన్ ట్విస్ట్ ఇచ్చారు. ప్రచార కమిటీ అనేది పార్టీకి ఫేస్ లాంటిది అని..రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయి వేరే వాళ్లకు ఆ బాధ్యత అప్పగిస్తే ఇబ్బందులు వస్తాయని ఊహించే ఈ మార్పులు చేసినట్లు చెబుతున్నారు. దీనికి తోడు పార్టీ సీనియర్ల నుంచి వచ్చిన వ్యతిరేకతను కూడా సర్దుబాటు చేసినట్లు అవుతుందని..మధ్యేమార్గంగా అధిష్టానం ఈ దిశగా ఆలోచించినట్లు సమాచారం.

అయితే రేవంత్ రెడ్డి వర్గం మాత్రం ప్రచార కమిటీ ఛైర్మన్ ముఖ్యమంత్రి రేసులో ఉంటారని..గతంలో కూడా పీసీసీ అధ్యక్ష పదవిలో ఉన్న వారికి సీఎం పోస్టు దక్కని అంశం తెలిసిందే అని ఉదహరిస్తున్నారు. సోమవారం రాత్రి ఢిల్లీలో దీనికి సంబంధించి తుది నిర్ణయం జరిగినట్లు సమాచారం అందుతోంది. పీసీసీ ప్రచార కమిటీ బాధ్యతలు రేవంత్ రెడ్డికి ఇచ్చి...పీసీసీ జీవన్ రెడ్డికా. కోమటిరెడ్డికా అన్న సంగతి తేలాల్సి ఉంది. అయితే ఓ ఛానల్ లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కూడా ప్రచార కమిటీ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

Next Story
Share it