Telugu Gateway
Politics

ఏపీలో రామ‌రాజ్యం న‌డుస్తోంది

ఏపీలో రామ‌రాజ్యం న‌డుస్తోంది
X

ప్ర‌జాగ్ర‌హ స‌భ పేరుతో బిజెపి నేతలు వైసీపీ ప్ర‌భుత్వంపై చేసిన విమ‌ర్శ‌ల‌పై ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స్పందించారు. టీడీపీ ఏజెంట్‌లు బీజేపీలో ఉండి జనాగ్రహ సభ పెట్టారని విమ‌ర్శించారు. చంద్రబాబు వెనకుండి ఇదంతా నడిపిస్తున్నారని ఆరోపించారు. ''బీజేపీ ఉనికే తక్కువ. టీడీపీ సపోర్ట్ వల్లే ఆ పార్టీ ఉందనుకోవాలి. టీడీపీ నుంచి పోయినవారే బీజేపీలో ఆపరేట్ చేస్తున్నారు. జనసేనలోనూ టీడీపీ వారే ఉండి ఆపరేట్ చేస్తున్నారు. ఏపీలో రామరాజ్యం నడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలున్నాయి.' అని సజ్జల వ్యాఖ్యానించారు.

ఆయ‌న పీఆర్సీ అంశంపై కూడా స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఉద్యోగుల‌కు మేలు చేసేందుకు వీలుగా పీఆర్సీ నివేదిక‌లో మార్పులు చేస్తున్నామ‌ని...అందుకే ప్ర‌క‌ట‌న‌లో జాప్యం అవుతుంద‌ని తెలిపారు. ఆర్ధిక ప‌రిస్థితి ఏ మాత్రం బాగాలేద‌ని..అయినా సీఎం జ‌గ‌న్ ఉద్యోగుల‌కు న్యాయం చేయాల‌నే యోచ‌న‌లో ఉన్నార‌న్నారు. ఉద్యోగ సంఘాల‌తో సీఎం జ‌గన్ స‌మావేశం ఉంటుంద‌ని..త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని తెలిపారు.

Next Story
Share it