Telugu Gateway
Politics

రాహుల్ గాంధీకి రామజన్మ భూమి ప్రధాన పూజారి ఆశీస్సులు

రాహుల్ గాంధీకి రామజన్మ భూమి ప్రధాన పూజారి ఆశీస్సులు
X

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కి ఇది ఊహించని ప్రశంసగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అయోధ్యలోని రామ జన్మభూమిలోని దేవాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేయేంద్ర దాస్ తాజాగా ఒక లేఖ రాశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మంగళవారం నాడు ఉత్తర్ ప్రదేశ్ లోకి ప్రవేశిస్తున్న వేళ ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. మీకు ఎప్పుడూ రాముడి ఆశీర్వాదాలు ఉంటాయని. మీరు చేస్తున్న ప్రయత్నంలో విజయం సాధించాలని ..దీర్ఘాయుష్షు ఉండాలని అంటూ అయన దీవించారు. దేశాన్ని ఒక్కటిగా ఉంచాలనే మంచి పని కోసం రాహుల్ గాంధీ పని చేస్తున్నట్లు అయన తన లేఖలో ప్రస్తావించారు.

ఈ లేఖను దాస్ ఒక కాంగ్రెస్ నాయకుడికి అప్పగించారు. మరి ఈ లేఖపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఈ పరిణామం బీజేపీ నేతలకు ఏ మాత్రం మింగుడు పడని విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ నేతలు..అయోధ్య అన్నా...రాముడు అన్నా తమకే పేటెంట్ ఉంది అన్నట్లు వ్యవహరిస్తారు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అయోధ్యలోని రామాలయం ప్రధాన పూజారి రాహుల్ పై ప్రశంసలు కురిపిస్తే బీజేపీ తట్టుకోగలదా అన్నది ఆసక్తి కరంగా మారింది.

Next Story
Share it