Telugu Gateway
Politics

గురువుతో పోటీపడితే ఆ కిక్కేవేరు!

గురువుతో పోటీపడితే ఆ కిక్కేవేరు!
X

అధికార టీఆర్ఎస్ కు ఊహించని షాక్ ఇచ్చిన దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే తిరుమల వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. వెంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్య నేర్పిన గురువుతోనే పోటీపడితే బాగుంటుందనీ, నేను గురువుగా భావించిన కేసీఆర్ నుండి ఆశీస్సులు లభిస్తాయని భావిస్తున్నాని వ్యాఖ్యానించారు.

దుబ్బాకలో బీజేపీ విజయం దక్షిణాది రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. తన విజయం పార్టీ సమిష్టి కృషికి నిదర్శనంగా పేర్కొన్నారు. పార్టీకి అన్ని విధాల సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. ప్రజాసేవ చేయాలనే తపనే ముఖ్యమంత్రి గడ్డపై తనను గెలిపించిందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే దుబ్బాక నియోజక వర్గాన్ని అగ్రగామిగా నిలిపేందుకు శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించానని తెలిపారు.

Next Story
Share it