ప్రశ్న ఏదైనా...మోడీ సమాధానం ఆయన ఇష్టం!

ఒక్క మణిపూర్ ఇష్యూ లోనే కాదు కొద్ది నెలల క్రితం దేశ కార్పొరేట్ రంగాన్ని కుదిపేసిన అదానీ-హిండెన్ బర్గ్ ఎపిసోడ్ లో కూడా ప్రధాని మోడీ తీరు తీవ్ర విమర్శల పాలు అయింది. అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ రిపోర్ట్ బయటికి వచ్చిన తర్వాత దేశ స్టాక్ మార్కెట్లు కుప్పకూలగా..అదానీ షేర్లలో పెట్టుబడి పెట్టిన వారు భారీగా నష్టపోయారు. అయినా సరే మోడీ మాత్రం ఇప్పటివరకు ఈ అంశంపై నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదు. ప్రధాని మోడీ-అదానీల మధ్య గాఢమైన సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ తీరు ఎలా ఉంది అంటే ప్రశ్న ఏదైనా...జవాబు మాత్రం ప్రశ్నతో సంబంధం లేకుండా తాను చెప్పాలనుకున్నదే చెపుతారని...ఇప్పటికే ఇది పలు మార్లు స్పష్టం అయింది అని చెపుతున్నారు. అందుకే ఆయన్ను ఆర్ట్ అఫ్ ఎస్కేపింగ్ లో మాస్టర్ అంటూ ప్రస్తావిస్తున్నారు. మోడీ తీరుపై శుక్రవారం నాడు మీడియా తో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాను ఎంతో మంది ప్రధానులను చూశాను కానీ ..ఇలా దిగజారి మాట్లాడిన ప్రధాని ని చూడలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని దేశ ప్రజలందరి ప్రతినిధి అని..అయన ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడకూడదు అన్నారు.