Telugu Gateway
Politics

బిజెపి ఉద్యమం వల్లే పీఆర్సీ

బిజెపి ఉద్యమం వల్లే పీఆర్సీ
X

ముఖ్యమంత్రి కెసీఆర్ సోమవారం నాడు అసెంబ్లీలో చేసిన పీఆర్సీ ప్రకటనపై తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ స్పందించారు. 'బీజేపీ చేసిన ఆందోళనలు, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనం బీజేపీ వైపు నిలబడటం వల్లనే రాష్ట్ర ప్రభుత్వానికి పీఆర్సీ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దుబ్బాక, జీహెచ్ ఎంసీ ఫలితాలే పునరావృతం అవుతాయని ఆందోళన చెందిన కేసీఆర్ రాత్రికి రాత్రే ఉద్యోగ సంఘాలను పిలిపించుకుని పీఆర్సీ ఇస్తున్నట్లు చెప్పి వాళ్ల ద్వారా ప్రకటనలు చేయించుకున్నారు. ఏది ఏమైనా బీజీపీ వత్తిడి వల్లనే సీఎం కేసీఆర్ అనివార్యంగా పీఆర్సీ ప్రకటించారనడం వాస్తవం. కానీ గతంలో ఇచ్చిన 43 శాతం కంటే ఎక్కువ ఫిట్ మెంట్ వస్తుందని ఆశించిన ఉద్యోగులందరిని ఈ ప్రకటన తీవ్ర నిరాశకు గురిచేసింది. కనీసం 44 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.పీఆర్సీ కమిటీ వేసిన నాటినుంచి పూర్తిగా మొత్తాన్ని నగదు రూపంలో ఇచ్చినప్పుడే ఉద్యోగ, ఉపాద్యాయవర్గాలకు న్యాయం జరుగుతుంది.పీఆర్సీ పెంపు వేతనం కేవలం 12 నెలలు మాత్రమే ఇస్తామని, అది కూడా రిటైర్ మెంట్ తర్వాత ఇస్తామనడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను మోసం చేసినట్లే అవుతుంది.

అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలన్నీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మీ మేనిఫెస్టోలో పెట్టారు. ఆనాడు ఇదే విషయాన్ని చెప్పి ఓట్లేసుకుని ఈ మూడేళ్లు ఏ ఒక్కటి అమలుచేయకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను మానసిక క్షోభకు గురిచేసింది ఈ సర్కార్. పైగా 2018 లో చెప్పిన దాన్ని మాడేళ్ల తర్వాత అమలు చేస్తున్నామని ప్రకటించి అదేదో గొప్ప చేశామని టీఆర్ఎస్ జబ్బలు చరుచుకోవడం వింతగా ఉంది. ఈహెచ్ఎస్ విషయంలో కమిటీ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేసే ప్రయత్నం చేస్తోంది. సీజీహెచ్ఎస్మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈహెచ్ఎస్ ను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పదవీ విరమణ వయసు పెంపు సాకుతో ఉద్యోగ నోటిఫికేషన్లు వేయక పోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తాం అంతే కాకుండా కొత్తగా ఏర్పడ్డ వ్యవస్థల్లో కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలి' అని డిమాండ్ చేశారు.

Next Story
Share it