సీఎంను ఓరేయ్ అనమని అంజనాదేవి చెప్పారా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. గత కొన్ని రోజు రోలుగా పవన్, పేర్ని నానిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై పవన్ చేసిన విమర్శలపై పేర్ని నాని స్పందించారు. ''పవన్ కల్యాణ్కు వాళ్ల అమ్మగారు సంస్కారం నేర్పలేదా?. ఆ సన్నాసి నన్నేం తిట్టాడు ... నేను ఏం మాట్లాడాను. నేను బూతులు తిట్టలేదు.
కాబట్టే టీవీలో నా ప్రెస్ మీట్ ప్రసారం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అరేయ్..ఉరేయ్ అని పిలవమని అంజనాదేవి నేర్పించారా. నేను రెడ్లకు పాలేరునైతే ... పవన్ కమ్మవాళ్లకు పాలేరు. నేను జగన్ దగ్గర పాలేరునే... పవన్కు చెప్పే దమ్ముందా. నన్ను అవమానించాలని చూస్తే ఆ అవమానాన్ని పరిచయం చేస్తా. దేశంలో కిరాయికి రాజకీయ పార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్. రాజకీయ పార్టీలకు టెంట్ హౌస్ పెట్టిన వ్యక్తి పవన్ కల్యాణ్.'' అని పేర్ని నాని మండిపడ్డారు.