Telugu Gateway
Politics

ఫోన్లు చూపించి...ఈడీకి లేఖ రాసిన కవిత

ఫోన్లు చూపించి...ఈడీకి లేఖ రాసిన కవిత
X

ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత మంగళవారం నాడు ఈడీ విచారణకు వెళ్లే ముందు రెండు కవర్లలో తన పాత మొబైల్ ఫోన్లను మీడియా కు చూపించారు. కవిత పది ఫోన్లను ధ్వంసం చేశారు అని ఈడీ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. అందుకే ఆమె ఫోన్లను మీడియా కు చూపించటం తో పాటు విచారణ కోసం ఈడీ అధికారులకు వీటిని అందచేయనున్నారు. ఈడీ తీరును తప్పుపడుతూ ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ కు లేఖ రాశారు. అందులో ఆమె పలు అంశాలను ప్రస్తావించారు. ‘ఫోన్ల ధ్వంసం ఆరోపణ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నాను. ఒక మహిళ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా ?. దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ నేను ధ్వంసం చేశానని పేర్కొంది. నన్ను కనీసం సమన్ చేయకుండా లేదా అడగకుండానే ఏ పరిస్థితుల్లో ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసింది ? . నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడి ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే. తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు. తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగింది. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడి వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరం’ అని పేర్కొన్నారు.

Next Story
Share it