Telugu Gateway
Politics

ప్ర‌తి ఎన్నిక‌కూ స‌వాళ్ళు క‌రెక్ట్ కాదు

ప్ర‌తి ఎన్నిక‌కూ స‌వాళ్ళు క‌రెక్ట్ కాదు
X

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ విసిరిన స‌వాల్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత స్పందించారు. ప్రతి ఎన్నికకూ సవాల్ చేయడం కరెక్ట్ కాదన్నారు. కేసీఆర్ గెలిచినన్ని ఎన్నికలు ఎవ్వరూ గెలువలేదని తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖాయం అని ధీమా వ్య‌క్తం చేశారు. బిజెపి హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధిస్తే సీఎం కెసీఆర్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తారా అంటూ బండి సంజ‌య్ స‌వాల్ విసిరిన విష‌యం తెలిసిందే.

దీనిపై స్పందించిన క‌విత మ‌రి ప‌శ్చిమ బెంగాల్ జ‌రిగిన ఉప ఎన్నిక‌లో మ‌మ‌తా బెన‌ర్జీ గెలిచినందుకు ప్ర‌ధాని మోడీ రాజీనామా చేశారా అని ప్ర‌శ్నించారు. ఈ ఎన్నిక‌ను బిజెపి ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది క‌దా అని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఎవరైనా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుంద‌ని సూచించారు. రాజకీయాలను ప్రతిపక్షాలు ఎక్కడికి తీసుకెళ్తారో అర్థం కావడం లేద‌న్నారు. బండి సంజయ్ మీడియాలో కనిపించేందుకు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు..

Next Story
Share it