Telugu Gateway
Politics

రెండు నెలల్లో టీఆర్ఎస్ సర్కారును కూలుస్తాం

రెండు నెలల్లో టీఆర్ఎస్ సర్కారును కూలుస్తాం
X

జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. మరి ఇది నిజమైన వ్యవహారమా? లేక ఎన్నికల ఎత్తుగడా?. ఇంత కాలం ఒకరిపై ఒకరు అసలు విమర్శలు చేసుకోకుండా ఉన్న టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య ఇప్పుడు మాటల తూటాలు పేలుతున్నాయి. అకస్మాత్తుగా టీఆర్‌ఎస్‌ పార్టీపై చార్మినార్‌ ఎమ్మెల్యే, మజ్లీస్ పార్టీ సీనియర్‌ నేత ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తలుచుకుంటే రెండు నెలల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చేయగలమని హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మజ్లీస్ పార్టీ చాలా మందిని చూసిందని, తమ అధినేత చెప్పినట్టు రాజకీయం తమ ఇంటి గుమస్తాతో సమానం అన్నారు.

కేటీఆర్‌ నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన చిలుక అని ఎద్దేవా చేశారు. తమకు రాజకీయాల్లో ఒకరిని గద్దే మీద కూరోచబెట్టడం తెలుసు.. గద్దె దించడం తెలుసు అని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎంఐఎం ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తీవ్రంగా స్పందించారు. టీఆర్ఎస్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. మరి ఈ వ్యవహారం ఇలా టీ కప్పులో తుఫానుగా మారిపోతుందా? లేక కొత్త మలుపులు తీసుకుంటుందా అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it