Telugu Gateway
Politics

ఒకే వేదిక‌పై 'సీనియ‌ర్ నేత‌లు'..ఠాకూర్ హ్యాపీ

ఒకే వేదిక‌పై  సీనియ‌ర్ నేత‌లు..ఠాకూర్ హ్యాపీ
X

తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు స‌మ‌సిపోయినట్లేనా?. ఒకే వేదిక‌పై సీనియ‌ర్ నేత‌లు అంద‌రూ ఆసీనులు అవ‌టంతో ఆ పార్టీ క్యాడ‌ర్లో కొత్త జోష్ వ‌చ్చింది. ఇదే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. వ‌రి దీక్షలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితోపాటు సీనియ‌ర్ నేత‌లు, ఎంపీలు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, విహెచ్ లు క‌ల‌సి ఉన్న ఫోటోల‌ను షేర్ చేస్తూ ఇది చూడ‌టం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వ‌రి దీక్ష కోసం కంక‌ణం క‌ట్టుకుని దీక్ష చేస్తున్న ఎంపీలు అని త‌న పోస్టులో పేర్కొన్నారు.

Next Story
Share it