కెటీఆర్ పై మాణిక్యం ఠాకూర్ ఫైర్
BY Admin5 Oct 2021 7:15 AM GMT
X
Admin5 Oct 2021 7:15 AM GMT
తెలంగాణ మంత్రి కెటీఆర్ పై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ లో రైతుల హత్యలపై కెటీఆర్ మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ఠాకూర్ ఘటన జరిగిన 48 గంటల తర్వాత మిస్టర్ 20 పర్సంట్ మేల్కొని..షాక్ గురయ్యారంట. కానీ కెటీఆర్ కు మోడీ కేబినెట్ లోని హోం మంత్రిని డిస్మిస్ చేయమని అడిగే గట్స్ లేవంటూ పేర్కొన్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై కారు నడిపిన మంత్రి కొడుకు అరెస్ట్ గురించి మాట్లాడలేదేంటన్నారు. ఈ ముసలికన్నీరుతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
Next Story