Telugu Gateway
Politics

రైతుల‌పై కెసీఆర్ క‌ప‌ట ప్రేమ‌

రైతుల‌పై కెసీఆర్ క‌ప‌ట ప్రేమ‌
X

తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కేసీఆర్ క‌మీషన్లు వ‌చ్చే ప్రాజెక్టుల‌కు ఆగ‌మేఘాల మీద నిధులు విడుద‌ల చేసి.. రైతుల విష‌యంలో ప‌ట్టించుకోవ‌డం లేద‌నిఅన్నారు. అస‌లు మీకు రైతులంటే ఎందుకు అంతా చిన్న‌చూపు.. దేశానికి ప‌ట్టెడ‌న్నం పెడుతున్నందుకా..? లేదా మీరు ఏమి చేసినా రైత‌న్న ఎదురు తిర‌గ‌డు అనా ? అని ప్ర‌శ్నించారు. వెంట‌నే రైతులకు బ‌కాయిప‌డ్డ 600 కోట్ల రూపాయల‌న‌ను విడుద‌ల చేయాలని లేదంటే రైత‌న్న‌ల‌ను వెంట‌బెట్టుకుని ప్రగతి భవన్‌ను కాంగ్రెస్ పార్టీ తరపున ముట్టడిస్తామ‌ని హెచ్చ‌రించారు.

ఈ మేర‌కు ఆయ‌న సీఎంకు లేఖ రాశారు. ఐకేపీ ద్వారా కొనుగోలు చేసిన వ‌రి ధాన్యం బ‌కాయిలు ఇంకా రూ.600 కోట్లు చెల్లించాల్సి ఉంద‌న్నారు. వరి ధాన్యం కొనుగోలు బ‌కాయిలు ఎందుకు చెల్లించ‌డం లేద‌ని లేఖ‌లో ప్రశ్నించారు. రైతు ప్ర‌భుత్వం అని చెప్పుకునే టీఆర్ఎస్ స‌ర్కార్ రైతుల ప‌ట్ల చిన్న‌చూపు చూస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతు ఎడ్చినా రాజ్యం ఎప్ప‌టికీ బాగుప‌డ‌దు.. కాబ‌ట్టి ఇక‌ నైనా రైతులు క‌న్నీరు పెట్టుకునే చర్య‌ల‌ను మానుకోవాల‌ని సూచించారు.

Next Story
Share it