Telugu Gateway
Politics

నేను బరిలో ఉంటే జానారెడ్డికి మూడవ స్థానమే

నేను బరిలో ఉంటే జానారెడ్డికి మూడవ స్థానమే
X

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించటం బిజెపికే సాధ్యం అవుతుందన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీలోకి రమ్మని సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడించారు. నాగార్జునసాగర్‌ నుంచి పోటీ చేయాలని, కొన్నిరోజులుగా బీజేపీ నేతలు అడుగుతున్నారని తెలిపారు. పోటీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తాను బీజేపీ నుంచి పోటీచేస్తే కాంగ్రెస్ నేత జానారెడ్డికి మూడో స్థానానికి పరిమితమవుతారని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ కుటుంబంలోని అంతర్గత కలహాల వల్లే.. మంత్రి కేటీఆర్‌ను సీఎం చేయలేదని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ బిజెపినే టీఆర్ఎస్ ను ఓడించగలదని వ్యాఖ్యానించటం కలకలం రేపుతోంది. ఆయన గత కొంత కాలంగా పార్టీపై అసంతృప్తితో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది కాంగ్రెస్ నేతలు పార్టీని వీడి బయటకు పోతుంటే..పార్టీలో ఉన్న నేతలు కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా.బిజెపికి అనుకూలంగా మాట్లాడటం క్యాడర్ ను షాక్ కు గురిచేస్తోంది.

Next Story
Share it