Telugu Gateway
Politics

కాంగ్రేసే రెండు రాష్ట్రాల్లో చావు నోట్లో తలపెట్టి తెలంగాణ ఇచ్చింది

కాంగ్రేసే రెండు రాష్ట్రాల్లో చావు నోట్లో తలపెట్టి తెలంగాణ ఇచ్చింది
X

ముఖ్యమంత్రి కెసీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, నాగార్జునసాగర్ అభ్యర్ధి కె. జానారెడ్డి స్పందించారు. ఈ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ అహంకారానికి.. సాగర్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని వ్యాఖ్యానించారు. హాలియా సభలో ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. గురువారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. కేసీఆర్‌కు కౌంటరిచ్చారు. ''కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించానంటున్నారు.. కానీ మా పార్టీ రెండు రాష్ట్రాల్లో చావు నోట్లో తల పెట్టి తెలంగాణ ఇచ్చిందన్న విషయం మరచిపోవద్దు.

రాష్ట్ర సాధన కోసం మేం పూర్తిగా సహకరించాం కాబట్టే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి. 30, 40 ఏళ్లు శాంతి సామరస్యాలు వెల్లివిరిసేలా నేను పనిచేశాను. కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టులు పూర్తి చేస్తా అన్నారు.. హైదరాబాద్‎లోనే కుర్చీ వేసుకుని కూర్చున్నారు' అని కేసీఆర్‌పై జానారెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Next Story
Share it