Telugu Gateway
Politics

దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

ఏపీ, తెలంగాణ రాజకీయాలకు సంబంధించి మాజీ ఎంపీ, తెలుగుదేశం నేత జె సీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇఛ్చి సోనియా గాంధీ తప్పు చేశారని అన్నారు. దీంతోనే కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభం అయిందని..తమకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీ ఇలా కావటం బాధాకరం అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావటం కూడా కష్టమే అన్నట్లు జె సీ దివాకర్ రె డ్డి వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం నాడు తెలంగాణ అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలోఆ పార్టీ నేతలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితోపాటు సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో చిట్ చాట్ చేశారు జె సీ. సీఎల్పీ వెలుపల దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు సీఐడీ ఇచ్చిన నోటీసులపై జేసీ స్పందించారు. ' మా అధినేత చంద్రబాబుకు ఒక్క కానిస్టేబుల్ మాత్రమే వెళ్లి ఒకే ఒక్క కాగితం (నోటీసులు) ఇచ్చాడు. కానీ మా సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి, ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసులు ఇవ్వాలంటే లారీలు కావాలి. దొనకొండ లేదా వైజాగ్ రాజధాని చేయాలని చంద్రబాబుకు మేం ఆనాడే చెప్పాం. ఒకసారి నిర్ణయం జరిగిన తర్వాత మార్చడం సరికాదని ఆయన చెప్పారు.' అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it