నేను క్రిమినల్ ను కాదు..కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఈ మేరకు అనుమతి కోసం ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు అనుమతి కోసం ప్రతిపాదన పంపారు. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి అనుమతి రాలేదు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ఇదే అంశంపై ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు. తనకు అనుమతి ఇచ్చేలా చూడాలన్నారు. సింగపూర్ లో జరిగే వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో ఢిల్లీ మోడల్ ను ప్రజంట్ చేసే అవకాశం వచ్చిందని..ఇది తనకే కాదు..దేశం గర్వించదగ్గ విషయం అని తన లేఖలో పేర్కొన్నారు. తన సింగపూర్ పర్యటనను అడ్డుకోవటం ఏ మాత్రం సరికాదని పేర్కొన్నారు. ఈ సమావేశాలు ఆగస్టు మొదటి వారంలో జరగనున్నాయి. తొలి రోజే ఈ సమావేశాల్లో మాట్లాడేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఆహ్వానించారు.