Telugu Gateway
Politics

ఏపీలో హిట్ల‌ర్ రాజ్

ఏపీలో హిట్ల‌ర్ రాజ్
X

కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ వ్య‌వ‌హారాల కాంగ్రెస్ ఇన్ చార్జి మాణికం ఠాకూర్ ఏపీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజు త‌న‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించారంటూ ఎంపీలంద‌ర‌కీ లేఖ‌లు రాశారు. అందులో త‌న‌పై జ‌రిగిన దాడి వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ త‌దుప‌రి జ‌రిగే స‌మావేశాల్లో త‌న‌కు అండ‌గా నిల‌వాలంటూ కోరారు. ఈ లేఖ‌ను చూసిన త‌ర్వాత మాణికం ఠాకూర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.

త‌న లోక్ స‌భ స‌హ‌చ‌రుడిని నుంచి ఇలాంటి లేఖ రావ‌టం చూసి షాక్ కు గురైన‌ట్లు తెలిపారు. ఇది ఏపీ పోలీసులు క్రూర‌మైన‌..పిచ్చిచ‌ర్య అని విమ‌ర్శించారు. సిద్ధాంత‌ప‌రంగా తాము ర‌ఘ‌రామ‌క్రిష్ణంరాజుతో విభేదిస్తామ‌ని..అయితే ఒక పార్ల‌మెంటేరియ‌న్ కే ఇలా జ‌రిగితే ఇక సాధార‌ణ రాజ‌కీయ కార్య‌క‌ర్త‌ల ప‌రిస్థితి ఏంటి అని అన్నారు. ఇది హిట్ల‌ర్ రాజ్య‌మా? అంటూ ప్ర‌శ్నించారు.

Next Story
Share it