Telugu Gateway
Politics

మోడీకి అసలు సిసలు పరీక్ష ఇదే!

మోడీకి అసలు సిసలు పరీక్ష ఇదే!
X

ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా ఆరు సార్లు బీజేపీ గుజరాత్ లో వరుసగా విజయం సాధిస్తూ వస్తోంది. మరి ఇప్పుడు ఏడవ సారి కూడా మేజిక్ రిపీట్ అవుతుందా. అది అంత ఈజీనా. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లకు ఇప్పుడు అసలు పరీక్ష ప్రారంభం కానుంది. ఎందుకు అంటే వీరిద్దరి సొంత రాష్ట్రము ఇదే అన్న విషయం అందరికి తెలిసిందే. అంతే కాదు గుజరాత్ ఎన్నికలు బీజేపీకి ఎందుకు కీలకం అంటే 2024 లోకసభ ఎన్నికలకు ఏడాది ముందు జరిగే గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో తేడా వస్తే మోడీ పని అయిపోయింది అని ప్రచారం స్టార్ట్ అవువుతుంది. రాజకీయంగా ఇది పెద్ద దెబ్బ అవుతుంది. వరసగా గుజరాత్ లో అధికారంలో ఉండటం..కేంద్రంలోనే వరుసగా మోడీ రెండు సార్లు మంచి మెజారిటీ తో ప్రధాని గా కొనసాగుతున్నారు. పలు అంశాలు మోడీకి ప్రతికూలంగా మారే అవకాశం లేక పోలేదు. కరోనా సమయంలోనే కేంద్రం వరస పెట్టి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచటం, నిరుదోగ్య సమస్య, ప్రభుత్వ సంస్థల ప్రైవైట్ పరం చేయటం, ద్రవ్యోల్భణం పెరగటం, దేశ అప్పులు గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో పెరగటం వంటి ఎన్నో అంశాలు మోడీ ప్రభుత్వానికి ప్రతికూలంగా మారిన విషయం తెలిసిందే.

ఇన్ని సమస్యలను అధిగమించి బీజేపీ మరో సారి గుజరాత్ లో అధికారాన్ని నిలబెట్టుకుంటే అది కూడా పెద్ద సంచలనమే అవుతుంది. గుజరాత్ లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. మరో వైపు ఆప్ కూడా గుజరాత్ ఎన్నికలపై భారీ ఆశలే పెట్టుకుంది. ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ కంటే అప్ ప్రచారం విషయంలో దూకుడు మీద ఉంది. మరి ఫలితం ఎలా ఉంటది అన్నది తెలియాలి అంటే డిసెంబర్ 8 వరకు ఆగాల్సిందే. 182 సీట్లు ఉన్న గుజరాత్ అసెంబ్లీ కి డిసెంబర్ 1 ..డిసెంబర్ 5 అంటే రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే మహారాష్ట్రలో ఏర్పాటు చేయాల్సిన వేదాంత ఫాక్స్ కాన్ చిప్ యూనిట్ తో పాటు టాటా, ఎయిర్ బస్ ల విమానాల తయారీ యూనిట్ కూడా అక్కడికి తరలించిన విషయం తెలిసిందే. ఈ రెండు యూనిట్స్ కలిపితే ఏకంగా లక్షన్నర కోట్ల ప్రాజెక్టులు తరలించుకు వెళ్లినట్లు అవుతుంది. గత కొన్ని రోజులుగా మోడీ గుజరాత్ లో వేల కోట్ల రూపాయల పనులను శ్రీకారం చుట్టారు.




Next Story
Share it