Telugu Gateway
Politics

సానుభూతి కోస‌మే ఈటెల ఆరోప‌ణ‌లు

సానుభూతి కోస‌మే ఈటెల ఆరోప‌ణ‌లు
X

క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన మంత్రి ఒక‌రు త‌న‌ను హ‌త్య చేయించేందుకు హంత‌క‌ముఠాతో చేతులు క‌లిపార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. వీటిపై మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ స్పందించారు. సానుభూతి కోసమే ఈటెల చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని విమ‌ర్శించారు. ఇది దిగజారుడు రాజకీయమని అన్నారు. బీజేపీలో ఉన్న ఈటెల‌ హత్య కుట్రపై సీబీఐ, ఎన్‌ఐఏతో విచారణ జరిపించుకోవచ్చన్నారు.

ఈ విషయంపై తొందరగా తేల్చాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను కోరుతున్నట్లు తెలిపారు. కేంద్రంతో చెప్పి ఈటెల ఆరోపణలపై నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఓటమి భయంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కొట్టిపారేశారు. ఈటల రాజేందర్‌కు ఏమీ కాదని ఆయన ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేస్తానని మంత్రి వ్యాఖ్యానించారు.

Next Story
Share it