Telugu Gateway
Politics

ఒక్కో కార్పొరేటర్ కు ఐదు కోట్లు ఆఫర్ చేస్తున్నారు

ఒక్కో కార్పొరేటర్ కు ఐదు కోట్లు ఆఫర్ చేస్తున్నారు
X

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి నుంచి గెలిచని కార్పొరేటర్లు టీఆర్ఎస్ లో చేరితే ఐదు కోట్ల రూపాయల ఆఫర్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు టీఆర్ఎస్ నేతలు ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. ఎంతో వేగంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం మేయర్ ఎన్నికను ఎందుకు చేపట్టడంలేదని ప్రశ్నించారు. ఖమ్మం, వరంగల్‌లోనూ ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసి గెలవాలనుకుంటున్నారని విమర్శించారు. కొత్తగుడం జిల్లా లక్ష్మీ దేవి మండలంలో ఐదుగురు మైనర్ బాలికలపై ప్రధాన ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై సంజయ్‌ ఘాటుగా స్పందించారు. ఈ ఘటన బయటకు రాకుండా టిఆర్ఎస్ నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

ఇప్పటికయినా కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బండి సంజయ్ గురువారం నాడు ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపించారు. వారు నిజంగా హీరోలే అని, 15 నిమిషాల పాటు పాతబస్తీని వారికి అప్పగిస్తే అంతా జల్లెడ పడతారని అన్నారు. ఓల్డ్‌ సిటీలోని రొహింగ్యాలు, పాకిస్తానిలను బయటకు తీస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి దమ్ముంటే వారికి 15 నిమిషాల పాటు సమయం ఇచ్చి పాతబస్తీని అప్పగించాలని కోరారు. ఖమ్మం, వరంగల్, సిద్దిపేట కార్పొరేషన్‌ చాలామంది నాయకులు బీజేపీ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఓడిపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అహంకారం తగ్గలేదని విమర్శించారు.

Next Story
Share it