Telugu Gateway
Politics

ఢిల్లీకి ఈటెల రాజేందర్

ఢిల్లీకి ఈటెల రాజేందర్
X

మాజీ మంత్రి, సీనియర్ నేత ఈటెల రాజేందర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తరుణంలో ఈటెల ఢిల్లీ పర్యటనతో బిజెపిలో చేరటం ఖాయం అయినట్లే కన్పిస్తోంది. సోమవారం నాడు ఆయన బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డాతోపాటు హోం మంత్రి అమిత్ షాతో పాటు తర నేతలను కలిసే అవకాశం ఉందని సమాచారం.

ఈటెల రాజేందర్ తోపాటు ఆయన వెంట ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. అసైన్ మెంట్ భూముల ఆక్రమణ పేరుతో ముఖ్యమంత్రి కెసీఆర్ ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించారు. అప్పటినుంచి తర్జనభర్జనలు పడ్డ ఈటెల రాజేందర్ చివరికి బిజెపి గూటికి చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తేలిపోయింది. కాంగ్రెస్ తోపాటు పలు పార్టీల నేతలతో భేటీ అయిన ఈటెల రాజేందర్ చివరకు బిజెపి వైపు మొగ్గుచూపారు. తొలతు సొంత పార్టీ పెడతారని కూడా ప్రచారం జరిగింది.

Next Story
Share it